రూ.225 కోట్ల బెట్టింగ్‌…

Betting Rs.255 crore ...

ఐపీఎల్‌ లో ఆయా రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు నిర్వహిస్తున్న టీ20 లీగ్‌లు అవినీతికి చిహ్నంగా మారాయి . ఈ కారణంగా ఇప్పటికే కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌ ను బీసీసీఐ ఆపడం జరిగింది . తాజాగా తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ లోనూ భారీ ఎత్తున బెట్టింగ్‌ జరిగినట్టు సమాచారం. ట్యూటీ పేట్రియాట్స్‌-మధురై పాంథర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌పై అంతర్జాతీయ గ్యాంబ్లింగ్‌ వెబ్‌సైట్‌ అయిన బెట్‌ఫెయిర్‌లో ఏకంగా రూ.225 కోట్ల బెట్టింగ్‌ జరిగినట్టు యాంటీ కరప్షన్‌ యూనిట్‌ బీసీసీఐకి నివేదిక ఇచ్చింది. ఇలాంటి వ్యవహారాలను పర్యవేక్షించే రెండు రీసెర్చ్‌ కంపెనీల నుంచి తమకు ఈ సమాచారం వచ్చినట్టు ఏసీయూ పేర్కొంది. అయితే ఆ తర్వాత ట్యూటీ పేట్రియాట్స్‌ ఆడిన మ్యాచ్‌లపై బెట్టింగ్‌ను ఆ సైట్‌ నిషేదించినట్టు సమాచారం. మరోవైపు బుకీలతో సంబంధాలున్నందుకు ఈ లీగ్‌లోని రెండు ఫ్రాంచైజీలను సస్పెండ్‌ చేసినట్టు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ గత వారం ప్రకటించాడు.

Tags:cricket bettingganguliiplt20

Leave a Response