ప్రభుత్వ నిర్మాణాలకు వైసీపీ రంగులే…

వైసీపీ వచ్చాక గ్రామ సచివాలయాలకు తమ పార్టీ పతాకం లోని రంగులైన ఆకుపచ్చ, తెలుపు, నీలం రంగులు వేయాలంటూ ఏకంగా అధికారిక ఉత్తర్వులే ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ చిత్రాన్ని కూడా ప్రదర్శించాలన్నారు. రంగుల ఖర్చు ఇతర లెక్కల సంగతి అటుంచితే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమిటని అధికారులు తలలు బద్దలు కొట్టుకుంటారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ భవనాలు ఆస్తులపైనా పార్టీలకు చెందిన రంగులు నేతల చిత్రాల కనిపించవద్దు. మరి ఇప్పటికే రంగులు పూసేసినమ సచివాలయాలు ట్యాంకులను ఏం చేయాలి అనేది ప్రశ్నగా మారింది. ఆయా రంగులను చెరిపి వేసి మళ్లీ తెల్లరంగు వేయాల్సిందే, అలా వేయటానికి ఖర్చు తీసేయడానికి మరో ఖర్చు. పంచాయతీ భవనాలను సచివాలయ భవనాలుగా మార్చే క్రమంలో ఆ భవనాలకు రంగులు వేస్తున్నారు. అది కూడా ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులో ఉండాలంటూ నమూనా ఫోటోలను కూడా ఉత్తర్వులతో పాటు జతచేశారు. ఈ రంగులు అచ్చంగా వైసీపీ జెండాను పోలి ఉన్నాయి. ప్రభుత్వ భవనాలకు రాజకీయ రంగులు వేయాలని అధికారిక ఉత్తర్వులు ఇవ్వడం ఇదే మొదటి సారి. యన ఆదేశాలను అమలు చేసే క్రమంలో గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు వాటర్ ట్యాంకులను వైసీపీ జెండా రంగులోకి మార్చనున్నారు. దీంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా పంచాయతీ ప్రభుత్వాస్తులన్నీ వైసీపీ జెండా రంగులోకి మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాలకు ఒక పార్టీకి పోలిన రంగులు వేయడం పై అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వ అధికారులు లెక్క చేయటం లేదు.

Tags:ycp party

Leave a Response