టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా అభిమానులకు పరిచయం అవుతున్న సినిమా ‘రాజ్ ధూత్’. నక్షత్ర, ప్రియాంక వర్మలు ఈ సినిమాలో హీరోయిన్లు గా నటిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ – కార్తీక్ దర్శకత్వంలో ఎమ్.ఎల్.వి సత్యనారాయణ(సత్తిబాబు) నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా లిరికల్ సింగిల్స్తో శ్రోతల్ని మెప్పించడానికి రెడీ అయింది యూనిట్. దీనిలో భాగంగా నేడు సినిమాలోని తొలి సింగిల్ ‘మనసున మనసున ఏదో ఆశ’ అంటూ సాగే మెలోడీ సాంగ్ను హైదరాబాద్ రేడియో సిటీలో విడుదల చేశారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో సినిమా హీరో మేఘామ్ష్, దర్శకులలో ఒకరైన కార్తీక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో మేఘామ్ష్ మాట్లాడుతూ, ‘‘సినిమాలో మొత్తం నాలుగు పాటలున్నాయి. ప్రతీ పాట ప్రత్యేకంగా ఉంటుంది. కథలో ఇమిడిపోయే పాటలవి. ఇప్పుడు విడుదల చేసిన ‘మనసున మనసున’ సాంగ్ ప్రేమలో భావాలను ఎలివేట్ చేస్తుంది. ఈ పాట షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్ చేసాను. శ్రోతల్ని కూడా మెప్పిస్తుంది. మిగతా పాటలు చక్కగా కుదిరాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ను మెచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు` అన్నిఈ అమ్మడు చెప్పింది. మొత్తానికి ఈ సినిమా కోసం అందరూ ఎదురు చేస్తున్నారు.