‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్ లో సాయిధరమ్ తేజ్ రాశి ఖన్నా

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు మొక్కలు నాటారు. ఈ రోజు సినీనటుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి హీరోయిన్ రాశి ఖన్నా మొక్కలు నాటారు.  సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు మారుతి రూపొందించిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఆ చిత్ర బృందం పాల్గొంది. పరిసరాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్ స్వీకరించాలని రాశి ఖన్నా కోరింది. మొక్కలు నాటిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.   

Leave a Response