టాలీవుడ్లో వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల నాటి పరిణామాల ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్తో స్పష్టమైంది. ఈ చిత్ర కథాంశాన్ని కాసేపు పక్కన పెడితే.. చిత్రంలో పాత్రధారుల విషయంలో వర్మ తన మార్క్ను చూపించారు. ఏపీ సీఎం జగన్ పాత్రకు సరిగ్గా ఆయనకు దగ్గర పోలికలు కలిగిన నటుడిని వర్మ వెతికి పట్టుకున్నారు. అతనే.. మలయాళ నటుడు అజ్మల్ అమీర్. రంగం, రచ్చ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అజ్మల్ జగన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రలో నటించడంపై అజ్మల్ తన మనోగతాన్ని ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఏపీ సీఎం జగన్ను తాను ఇప్పటివరకూ కలవనే లేదని, కానీ ఆయన వీడియోలను చూసి మేనరిజాన్ని అనుకరించినట్లు అజ్మల్ చెప్పాడు. నెల క్రితం ఈ సినిమా షూటింగ్ మొదలైందని.. పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం సంతోషంగా ఉందని తెలిపాడు. సీఎం పాత్ర చేయడం తనకు కొత్తేమీ కాదని, ‘రంగం’ సినిమాలో కూడా తాను సీఎం పాత్రలో నటించానని చెప్పాడు. జగన్ రాజకీయ ప్రస్థానం గురించే ఈ సినిమా ఉంటుందని అజ్మల్ స్పష్టం చేశాడు.
previous article
మా ఆయనే బిగ్బాస్– 3 విజేతగా..
next article
కవిత ఓడిపోగా లేనిది పీసీసీ చీఫ్ ఓడిపోతే ఏమైంది..!
Related Posts
- /No Comment
పవన్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన చేసిన తరణ్ ఆదర్శ్
- /No Comment