టాలీవుడ్ లారెన్స్ హీరోగా ద్విపాత్రాభినయం చేస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘కాంచన – 3’. ‘ముని’ సిరీస్లో భాగంగా నాలుగో సినిమాగా వస్తున్న ఈ సినిమా వేదిక, ఓవియా కథానాయికలు. తమన్ సంగీతం అందించారు. ఠాగూర్ మధు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ తనకు సమాజ సేవ చేయాలని ఎలా, ఎప్పుడు అనిపించిందో వివరించారు. శ్రీమాన్, దేవదర్శిని, కోవై సరళనే హీరోలు అని చెప్పారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.