రాజ్‌తరుణ్‌ సరసన ‘అర్జున్‌ రెడ్డి’ భామ

మరొక కొత్త జోడీ కుదిరింది. యువ కథానాయకుడు రాజ్‌ తరుణ్‌ సరసన, ‘అర్జున్‌రెడ్డి’ నాయిక షాలినిపాండే నటించబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై  జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో ‘ఇద్దరి లోకం ఒకటే’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రాజ్‌తరుణ్‌ కథానాయకుడు. నాయికగా షాలిని పాండేని ఎంపిక చేశారు. ‘అర్జున్‌రెడ్డి తర్వాత ‘118’తో మరో విజయాన్ని అందుకొందామె. ఆ తర్వాత ఆమె తెలుగులో ఒప్పుకున్న సినిమా ఇదే.

Leave a Response