పద్దతి మార్చుకోకపోతే పరువునష్టం దావా వేస్త: కేటీఆర్

తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు పద్దతి మార్చుకోకపోతే పరువు నష్టందావా వేయనున్నట్లు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని తాను చెప్పినట్లు తెలిపారు. విద్యార్థులు తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. రూ. 4 కోట్ల 35 లక్షల 70 వేలకు గ్లోబరీనాకు టెండర్ దక్కింది. ఒకాయన 10 వేల కోట్ల స్కాం జరిగిందని అంటున్నడన్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదన్నారు. కేసీఆర్‌ను ఎవరైనా ఏమైనా అంటే కొన్ని మీడియాలు కత్తులు దూసేందుకు రెడీగా ఉంటాయన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడవద్దని.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందని కేటీఆర్ వెల్లడించారు.

Leave a Response