అన్నింటికీ సిద్ధపడే పార్టీ పెట్టాం పవన్‌..

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. తాను రెండు చోట్ల ఓడిపోయినా తమ పార్టీకి చెందినవారు ఒక్కరు కూడా గెలవకపోయినప్పటికీ తుదిశ్వాస వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టంచేశారు.జనసేనకు ఈ ఎన్నికల్లో తీవ్ర నిరాశే మిగిలింది. పవన్‌ కల్యాణ్‌ రెండుచోట్ల పోటీచేసి ఓటమిపాలయ్యారు. భీమవరంలో వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో పవన్‌ సుమారు 2 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోవైపు గాజువాకలోనూ వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో పవన్‌ ఓడిపోయారు. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన ఆ పార్టీ కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది అని పవన్‌ అన్నారు.  ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి అండగా నిలుస్తామన్నారు. ‘‘ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన వైకాపా, సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్‌ జగన్‌కు, దేశంలో రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు. ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అభ్యర్థిస్తున్నా. సుదీర్ఘకాలంగా మార్పు కోసం జనసేన పెట్టాం. ఎన్ని రకాల ఒడిదొడుకులు వచ్చినా ఎదుర్కొనే సత్తా, ధైర్యం మాకు ఉంది. అన్నింటికీ సిద్ధపడే పార్టీ పెట్టాం. మా పార్టీకి ఓటు వేసిన ప్రతి ఓటరుకూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. డబ్బులు పంచకుండా, ఓటర్లను ప్రభావితం చేయకుండా క్లీన్‌ పాలిటిక్స్‌ చేయడం, నవ యువకులకు టికెట్లు ఇవ్వడం.. వంటి పనులు మాకెంతో ఆనందాన్ని కల్గించాయి’’

 

Leave a Response