‘ఓ బేబీ’ వేడుకకి ముఖ్య అతిథులుగా బాబాయ్-కొడుకు రానున్నారు..!

అక్కినేని సమంత ఎన్నో సినిమాలో నడిచారు.అలాగే ఎన్నో భాషలో తెలుగు,తమిళ్ నడిచారు కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ మూవీలో ఒక డిఫరెంట్ పాత్రలో మన ముందుకు రానున్నారు సామ్.నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా ‘ఓ బేబీ’ నిర్మితమైంది. ఓ కొరియన్ సినిమాకి ఇది రీమేక్. 7 భాషల్లో ఆదరణ పొందిన ఈ కథను తెలుగులో రీమేక్ చేశారు. సీనియర్ హీరోయిన్ లక్ష్మి కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, వచ్చేనెల 5వ తేదీన తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం 6:30 నిమిషాలకి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లోని ‘జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్’ ఈ వేడుకకి వేదిక కానుంది. ఈ వేడుకకి “వెంకటేశ్ – రానా” ముఖ్య అతిథులుగా రానున్నారు. ఈ సినిమా టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన సమంతకి మరో హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Leave a Response