సీఎం ఏం చర్చించారో తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు ఉంది.

ఏపీ సీఎం జగన్ నిన్న ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. మీడియాతో జగన్ మాట్లాడకుండానే తిరిగి ఏపీకి వచ్చేశారు. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ పర్యటనలో జగన్ మీడియాకు ముఖం చాటేశారని,ప్రధానితో సీఎం ఏం చర్చించారో తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు ఉందని అన్నారు. ప్రధానితో చర్చల వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. మోదీని జగన్ కలవడంపై ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) మొక్కుబడిగా పత్రికా ప్రకటన విడుదల చేయడమేంటి?విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కన్నా వైసీపీ పాలనతో జరిగిన నష్టం ఎక్కువగా ఉంది.ప్రజల తలసరి ఆదాయం పడిపోవడానికి సీఎం నిర్వాకాలే కారణమని, ఏపీకి పెట్టుబడిదారులు రావట్లేదని ముఖ్యమంత్రి ఇచ్చిన వినతిపత్రంలోనే ఉందని అన్నారు.

Tags:jagan mohan reddyyanamala ramakrishnud

Leave a Response