పార్టీలో మార్పు…

కొన్ని రోజుల నుండి పీసీసీ మార్పు పైనే హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. డిసెంబర్ నెలలో మార్పు ఖాయమని ఏఐసీసీ ఇప్పుడే ఎవరికిస్తే బాగుంటుందో అని ఆరా తీస్తున్నట్లు కనిపిస్తుంది. పీసీసీ కోసం పార్టీలో అర్హత ఉన్న నాయకులందరూ వారి వారి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో పీసీసీ కంటే ముందు ఏఐసీసీ ఇన్ చార్జి మారిస్తే బాగుంటుందనే వాయిస్ ని కొందరు నేతలు హైకమాండ్ దగ్గర వినిపించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఇన్ చార్జి స్థానంలో ఎవరిని నియమిస్తారనే అనే చర్చ ప్రారంభం అయింది. పార్టీ ఆశించిన ఫలితాలు రాబట్టలేదన్న ఫీలింగ్ చాలా మంది నాయకుల్లో ఉంది. ఇప్పటికే ఏఐసిసి నుండి పీసీసీ వరకు అన్ని స్థాయిల్లో మార్పులు చేయాలని పార్టీ భావిస్తున్న తరుణంలో కుంతియాని కూడా మార్చుతారనే ప్రచారం జరుగుతోంది.లంగాణకు పరిచయం ఉన్న నాయకుడు కాస్త ప్రభావితం చేయగలిగిన నాయకుడిని ఇన్ చార్జిగా పెట్టే అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది. దీంతో పీసీసీ కంటే ముందు ఇన్ చార్జ్ మార్పు ఉంటుంది అనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో నడుస్తుంది.

Tags:revanth reddytelangana congress

Leave a Response