సొంత బాబాయిని హత్య చేసిన నిందితులు…

జగనకు సమీప బంధువు ఎంపీ అవినాష్ రెడ్డి, తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు మనోహర్ రెడ్డిలను సిట్ అధికారులు పిలిపించి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో టిడిపికి చెందిన శివరాఘవరెడ్డి సహా ఇద్దరు టిడిపి నేతలను సిట్ బృందం ప్రశ్నించినట్లు సమాచారం. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు గడుస్తున్నా సొంత బాబాయిని హత్య చేసిన నిందితులను ఎందుకు పట్టుకోలేదని కడప జిల్లా పర్యటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. వివేక హత్య కేసులో సిట్ సీఎం సమీప బంధువులను పిలిపించి ప్రశ్నించటం సంచలనం సృష్టించింది. ఈ కేసును చేధించేందుకు అప్పటి సీఎం చంద్రబాబు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా టెక్నికల్ టీం, ఫీడ్ టీం, డాక్యుమెంటరీ సేకరణ టీమ్, ఇన్వెస్టిగేషన్ టీంలను నియమించారు. మహంతి ఆధ్వర్యంలోనే వివేక హత్య కేసును సిట్ బృందం దర్యాప్తు చేసింది. విచారణ కొనసాగుతుండగానే సిట్ కు నాయకత్వం వహిస్తున్న ఎస్పీ మహంతి నెలన్నర క్రితం దీర్ఘ కాలిక సెలవులో వెళ్లడంతో ఆయన స్థానంలో ఎస్పీగా కేకేఎన్ అన్బురాజన్ ను నియమించింది.

Tags:jagan mohan reddy

Leave a Response