ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌ తొలి ఫొటో చూశారా..!

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాను తెరిచిన సంగతి తెలిసిందే. ఒక్క ఫొటో కూడా పోస్ట్‌ చేయకుండానే ఆయన ఖాతాను అనుసరిస్తు్న్న వారి సంఖ్య ఏడు లక్షలకు చేరింది. అయితే ప్రభాస్‌ ఎట్టకేలకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్‌ చేశారు. ‘బాహుబలి’ చిత్రంలోని ఓ స్టిల్‌ను తొలి ఫొటోగా పోస్ట్‌ చేశారు.
ప్రొఫైల్‌ పిక్చర్‌గా కూడా అదే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘సాహో’ సినిమాలో నటిస్తున్నారు కాబట్టి.. ఈ చిత్రంలోని ఓ స్టిల్‌ను తొలి పోస్ట్‌గా పెడతారని అభిమానులు అనుకున్నారు. కానీ ‘బాహుబలి’ స్టిల్‌ను పెట్టి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ ఫొటోకు రెండు లక్షల నలభై ఏడు వేల లైక్‌లు వచ్చాయి.
ఫాలోవర్ల సంఖ్య కూడా ఎనిమిది లక్షలు దాటింది. అయితే ఈ ఖాతా ఇంకా వెరిఫైడ్‌ కాలేదు. ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్‌ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.  ఫేస్‌బుక్‌లో ఇప్పటికే ఆయన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య పది మిలియన్లకి చేరింది. ఆయన నటిస్తున్న ‘సాహో’ సినిమాకు సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఆగస్టు 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Response