అక్కినేని నాగార్జునకు,మోదీ ట్వీట్..?

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో.. తమ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లను చైతన్య పర్చాలంటూ ఆయనకు మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా ఓటు హక్కు వినియోగంలో వెనుక బడిన ఓటర్లను చైతన్య పర్చలాంటూ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు మోదీ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కింగ్ నాగార్జునకు ట్వీట్ పెట్టారు మోదీ. ‘‘గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సినిమాల ద్వారా లక్షల మంది ఆధారాభిమానాలు సంపాదించారు. అలాగే పలు అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు. చాలా ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్న మీరు.. ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరిగేలా ఓటర్లను చైతన్య పరచాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Leave a Response