మరోసారి ఇద్దరూ కలసి పనిచేయడానికి సన్నాహాలు……..

నేను శైలజ’తో  దర్శకుడిగా పరిచయం అయిన కిషోర్‌ తిరుమల రామ్‌ తో కలసి ఓ తమిళ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. వీరిద్దరి  కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు నేను శైలజ’‘ఉన్నది ఒకటే జిందగీ’ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలసి పనిచేయడానికి సిద్ధమైనట్టు సమాచారం. స్రవంతి మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం రామ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో బిజీగా ఉన్నారు జూన్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఆ తరవాతే కొత్త సినిమా పట్టాలెక్కుతుంది.

Leave a Response