డిమాండి కాలనీ’, ‘ఇమైకా నొడిగల్’ వంటి రొటీన్కు భిన్నమైన చిత్రాలతో తనలోని ప్రతిభను చాటుకుంటున్న దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు. తదుపరి ఆయన విక్రమ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం రాజేష్ సెల్వ దర్శకత్వంలో ‘కడారం కొండాన్’లో నటిస్తున్నారు విక్రమ్. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత వీరి చిత్రం మొదలవుతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే మణిరత్నం దర్శకత్వంలోని ‘పొన్నియిన్ సెల్వం’ చిత్రం కోసం విక్రం తన శరీరాకృతిని ఆ పాత్రకు తగ్గట్లు మార్చుకుంటున్నారని, ఈ సినిమా తర్వాత అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటిస్తారని సమాచారం. ఒకవేళ పొన్నియిన్ సెల్వం ఆలస్యమైతే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముందని తెలుస్తోంది. మొత్తానికి ఇటీవల జ్ఞానముత్తు చెప్పిన కథ విక్రమ్కు నచ్చడంతో ఈ సినిమా ఖరారైందని కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. హర్రర్, థ్రిల్లర్ చిత్రాలతో ఆకట్టుకున్న జ్ఞానముత్తు.. విక్రమ్ హీరోగా ఎలాంటి సినిమాను రూపొందిస్తారో వేచి చూడాలి.
previous article
అందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా!
next article
భ్రష్టాచారి’ వ్యాఖ్యలపై మోదీకి క్లీన్చిట్
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment