నేను నటుడిని కావడానికి ఆయనే స్ఫూర్తి: చిరు

నేను నటుడు కావడానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎస్వీ రంగారావు గారు అని చిరంజీవి అన్నారు. ఆయన సినిమాలు చూసేక నాకు నటించాలన్న ఆశ కలిగింది’ అని అన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. నట దిగ్గజం ఎస్వీ రంగారావుపై సంజయ్‌ కిషోర్‌ రాసిన ‘మహానటుడు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నేడు శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘నా ఆరాధ్య నటుడు, అపారంగా అభిమానించే వ్యక్తి ఎస్వీ రంగారావుగారు. ఆయన పేరుమీద వచ్చిన పుస్తకాన్ని ఆవిష్కరించడం నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన వరం అన్నారు. ఎస్వీఆర్‌, సావిత్రిగారు, కన్నాంబగారి నటనకు భూత, భవిష్యత్‌ వర్తమానాలు ఉండవు. వారిది సహజ నటన అన్నారు. ఎస్వీ రంగారావుగారి సినిమాలు చూసి ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన ఒక ఎన్‌సైక్లోపిడియా లాంటి వారన్నారు. ఆయనపై అంత అభిమానం పెరగడానికి కారణం మా నాన్నగారు. నా చిన్నప్పుడు నాన్న గారు నాటకాలు వేస్తుండేవారు. ఆర్థిక సమస్యల కారణంగా ఆయనెప్పుడూ మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించలేదు. అయితే, ఎస్వీఆర్‌తో కలిసి ‘జగజంత్రీలు’, ‘జగత్‌ కిలాడీలు’ చిత్రాల్లో చిన్న పాత్రలు వేసే అవకాశం వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఎస్వీఆర్‌, ఆయన నటన గురించి నాన్న చెబుతుండేవారు. ఆ విధంగా రంగారావుగారి మీద అభిమానం పెరిగింది. నేను నటుడిని అవ్వాలని కోరిక కలగడం అప్పుడే బీజం పడి ఉంటుంది. రామ్‌చరణ్‌ సినిమాల్లోకి వస్తానన్నప్పుడు రంగారావుగారి సినిమాలు చూపించేవాడిని. ఈ పుస్తకం గురించి సంజయ్‌ కిషోర్‌ చేసిన ప్రయత్నం అభినందనీయం మని అన్నారు. ఇది ధనాపేక్ష కోసం ఆయన చేయలేదు. కళ మీద ఉన్న తపన, ఎస్వీఆర్‌ మీద ఉన్న అభిమానంతో ఈ పుస్తకం రాసినందుకు ఆయనను అభినందిస్తున్నా.

ఈ సందర్భముగా ప్రముఖ హస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘సంజయ్‌ గతంలో పలు పుస్తకాలు రాశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, ఇప్పుడు ఎస్వీ రంగారావుగారు. ఇందులో ఉన్న ఫొటోల గురించి బహుశా వాళ్లకు కూడా తెలిసి ఉండదేమో అని హాస్య బ్రహ్మ అన్నారు. నటనకు ఒక రూపం ఉంటే అదే ఎస్వీ రంగారావు. వాళ్లు చనిపోయిన, ఇన్నేళ్ల తర్వాత కూడా వారిని గుర్తు చేసుకుంటూ పుస్తకం విడుదలైందంటే అది వారి గొప్పతనానికి వారు చేసిన నతనికి నిదర్శనం అన్నారు. అలాంటి వ్యక్తుల గురించి పుస్తకం వేయాలన్న ఆలోచన సంజయ్‌కు రావడం నిజంగా అభినందనీయం. ‘సైరా’ బిజీ షెడ్యూల్‌లోనూ అడిగిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చిన నా మిత్రుడు చిరంజీవి కి కృతజ్ఞతలు చెప్పాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్‌, తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, రావికొండలరావు, రోజా రమణి దితరులు పాల్గొన్నారు.

Leave a Response