అప్పుడు కనిపించలేదా? ఎన్ కౌంటర్ తర్వాతే గుర్తుకొచ్చాయా?

దిశ నిందితులను ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ఆర్సీ విచారణ జరిపింది. దిశ పేరెంట్స్ ను, సోదరిని ఎన్ హెచ్ఆర్సీ ప్రశ్నించింది. ఆరోజు అసలేం జరిగిందో తెలుసుకునేందుకు దిశ కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్స్ ను రికార్డు చేసింది. దిశపై అత్యాచారం చేసి దారుణంగా చంపేసినప్పుడు ఈ మానవ హక్కుల కమిషన్ ఎక్కడికిపోయిందని నిలదీశారు. అప్పుడు మానవ హక్కులు కనిపించలేదా? కేవలం ఎన్ కౌంటర్ తర్వాతే గుర్తుకొచ్చాయా? విచారణకు హాజరయ్యేందుకు దిశ కుటుంబ సభ్యులు మొదట నిరాకరించారు. దిశ దశ దిన కర్మ రోజున విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు.దిశ పేరెంట్స్ ను ఒప్పించిన పోలీసులు ఎస్కార్ట్ మధ్య ఎన్ హెచ్ఆర్సీ ముందు హాజరుపరిచారు. అయితే, ఎన్ కౌంటర్ గురించి తమను ఏమీ అడగలేదని ఆరోజు ఘటన ఎలా జరిగిందో మాత్రమే అడిగారని దిశ తండ్రి తెలిపారు. ఎన్ హెచ్ఆర్సీ విచారణకు హాజరయ్యేది లేదని దిశ కుటుంబ సభ్యులు తేల్చిచెప్పడంతో స్థానికులు కూడా మద్దతుగా నిలిచారు.

Tags:disha casejustice for dishaNHRC

Leave a Response