రేపు గుడ్ మార్నింగ్ చెపుతున్న మహర్షి…?

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్ తాజా సినిమాగా ‘మహర్షి’ అభిమానుల ముందుకు వస్తుందాన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగు పరంగా ముగింపు దశకి చేరుకుందని సినీ రంగాలు చెపుతున్నాయి. మే 9వ తేదీన ఈ సినిమాను తెరకెక్కనుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకు వచ్చిన మహేశ్ పోస్టర్స్ ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘ఉగాది’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను విడుదల చేసారు మన దర్శకుడు..ఈ పోస్టర్లో కార్పొరేట్ స్టైల్ బిజినెస్ మేన్ లుక్ తో కనిపిస్తూ బు మరింతగా ఆకట్టుకుంటున్నాడు. రేపు ప్రిన్స్ ఉదయం 9 గంటల 9 నిమిషాలకి ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తాజా పోస్టర్ ద్వారా మరోసారి స్పష్టం చేశారు. ఈ టీజర్ తో అభిమానుల్లో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగేలా శ్రద్ధ తీసుకున్నారట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో, ‘అల్లరి’ నరేశ్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తూ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నడట.

Leave a Response