‘మహర్షి’లో చేరిన కొత్త పాటిదే..!

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ సినిమాలో ఓ కొత్త పాటను చేర్చారు. ‘ఫిర్‌ సే..’ అనే పాటను సినిమాలో యాడ్‌ చేసినట్లు చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ నేడు ప్రకటించింది. పోస్టర్‌లో మహేశ్‌ స్టైల్‌గా కూర్చుని చాయ్‌ తాగుతూ కనిపించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఈ పాటకు సంబంధించిన లిరికల్‌ వీడియోను విడుదల చేయనున్నారు. సాయంత్రమే ‘మహర్షి’ జ్యూక్‌ బాక్స్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించారు. ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. మే 9న ‘మహర్షి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Leave a Response