జాన్ కు గ్రీన్ సిగ్నల్…

ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, బాహుబలివంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు. ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో అనుష్క, రానా దగ్గుబాటి లతో కలసి బాహుబలి సినిమాలో నటించాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో మొదటి భాగం “బాహుబలి – ది బిగినింగ్ ” తెలుగు, తమిళ, మలయాళ మరియు హిందీ భాషలలో జూలై 10 న భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై, భారత చలనచిత్ర రంగంలో ఇంతవరకు నమోదు చేయని కలెక్షన్లను వసూలు చేసి అఖండ విజయం సాధించింది. రెండవ భాగం పనులు పూర్తి చేసుకొని 2017 ఏప్రిల్ 28న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తో ప్రభాస్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ప్రస్తుతం ప్రభాస్ ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వం లో సాహో అను చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం 2019 లో విడుదల కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా తరువాత ఆయన ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోను ఒక సినిమాను అభిమానుల ముందుకు తెస్తున్నాడు. ఈ సినిమాకి ‘జాన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమా తరువాత ఆయన మరో ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టేసినట్టుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related image


ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు అని టాలీవుడ్ అంత అంటున్నారు. ఇటీవలే తన దగ్గరున్న ఒక కథను గురించి ప్రభాస్ కి దిల్ రాజు చెప్పడం .. చేద్దామని ఆయన అనడం జరిగిపోయాయట. ఆ కథను అద్భుతంగా తెరపై ఆవిష్కరించే దర్శకుడి కోసమే దిల్ రాజు అన్వేషణ సాగుతోందని చెబుతున్నారు. గతంలో డార్లింగ్ కి ‘మున్నా’ వంటి ఫ్లాప్ ఇచ్చిన దిల్ రాజు, ఆ తరువాత ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ తో భారీ విజయాన్ని అందించిన సంగతి మన అందరికి తెలిసిందే. మరి వీళ్ళ కాంబినేషనలో వస్తున్నమూడోవ సినిమా ఇదే.

Leave a Response