ఎమ్మెల్యేకు మాత్రం పోలీస్ స్టేషన్ లో రాజమర్యాదలు చేశారు..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఘాటుగా స్పందించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఓ మహిళా ఎంపీడీవో అర్ధరాత్రి వేళ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళితే కేసు నమోదు చేసేందుకు 8 గంటల పాటు తర్జనభర్జన పడ్డారని అన్నారు. ఆమె కష్టాలకు కారకుడైన వైసీసీ ఎమ్మెల్యేకు మాత్రం పోలీస్ స్టేషన్ లో రాజమర్యాదలు చేశారు అని అన్నారు. దసరా ఉత్సవాలను స్త్రీశక్తికి సూచికగా జరుపుకుంటారని, అలాంటి వేళ విధి నిర్వహణలో నిజాయతీగా వ్యవహరించిన ఓ మహిళా అధికారికి జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఇది అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆపై ఆయన కొన్ని గంటల్లోనే బెయిల్ పై బయటికి రావడం తెలిసిందే.

Tags:kotam reddy sridar reddynara lokesh

Leave a Response