వేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు..

టాలీవుడ్ లో కుటుంబ నేపథ్యంలో సాగే కథాంశాలను ఎంచుకుని తెరపై ఆహ్లాదంగా ఆవిష్కరించడంలో దర్శకుడిగా సతీశ్ వేగేశ్న తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆయన తాజా సినిమా ‘ఎంత మంచివాడవురా’ రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కల్యాణ్ రామ్ – మెహ్రీన్ జంటగా అభిమానుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందనే టాక్ కొన్ని రోజుల క్రితం వినిపించింది.అయితే ఇటీవల అందుకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో, జనవరిలో రాదేమోనని అనుకున్నారు. కానీ ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ పూర్తిచేసుకుందనీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనే సమాచారాన్ని ఇస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15వ తేదీన విడుదల చేస్తున్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు.

Leave a Response